ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ఖర్చులో.. ప్రతి రూపాయి బాధ్యత కేంద్రానిదే: మంత్రి అనిల్ - పోలవరం తాజా వార్తలు

పోలవరంపై పూర్తి బాధ్యత కేంద్రానిదేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ప్రతి రూపాయి ఖర్చు కేంద్రం బాధ్యతేనని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. డ్యాం పూర్తిస్థాయి ఎత్తులో నీళ్లు నిలుపుతామన్నారు. అంగుళం కూడా తగ్గదని స్పష్టం చేశారు. పోలవరం డ్యామ్ వద్ద వైఎస్​ఆర్ విగ్రహం పెడతామని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

Minister anil kumar yadav
Minister anil kumar yadav

By

Published : Nov 17, 2020, 5:46 PM IST

పోలవరం ఖర్చులో.. ప్రతి రూపాయి బాధ్యత కేంద్రానిదే : అనిల్

పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దానిపై ప్రతి రూపాయి ఖర్చు బాధ్యత కేంద్రానిదే అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఆయన పర్యటించారు. 2014 భూసేకరణ చట్టప్రకారం కేంద్రమే నిధులివ్వాలని, ఇస్తుందని సైతం చెప్పారు.

పోలవరానికి ప్రధాని మోదీ అన్ని రకాలుగా సహకరిస్తున్నారన్నారు. జలాశయ ఎత్తు తగ్గిస్తున్నట్టు వస్తున్న ఆరోపణలపై స్పందించారు. అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి విశాఖకు నీళ్లు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఎత్తు తగ్గిస్తున్నామని, గుత్తేదారులతో లాలూచీ పడ్డామని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారని అనిల్ కుమార్ అన్నారు. రూ.55 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.17 వేల కోట్లు ఏవిధంగా 70 శాతం అవుతుందని మంత్రి ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లిస్తామన్నారు.

డ్యాం పూర్తిస్థాయి ఎత్తులో నీరు నిలుపుతామని, అంగుళం కూడా తగ్గదని మంత్రి అనిల్‌ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ నిబంధనల మేరకే పోలవరంలో నీటి నిల్వ సామర్థ్యమన్న మంత్రి... వచ్చే 3 నెలల్లో ఏఏ పనులు చేయాలనే దానిపై సమీక్ష నిర్వహించామని చెప్పారు.

ఇదీ చదవండి:

లైవ్ వీడియో: డబ్బులు ఇవ్వలేదని వ్యక్తిని చితకబాదిన క్రికెట్ బుకీలు

ABOUT THE AUTHOR

...view details