ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జల్సా'... మునగాల సాయివెంకట కృష్ణ కథ ఇది..! - mechanic thief arrested in cheborlu

అతను ద్విచక్రవాహనాలకు మరమ్మతులు చేసే మెకానిక్. జల్సాలకు అలవాటు పడిన అతనికి మరో ఇద్దరు తోడయ్యారు. చివరకి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

mechanic thief arrested
వృత్తి మెకానిక్... ప్రవృత్తి దొంగతనాలు!

By

Published : Jan 9, 2020, 12:19 PM IST

Updated : Jan 9, 2020, 9:51 PM IST

'జల్సా'... మునగాల సాయివెంకట కృష్ణ కథ ఇది..!

బైక్ మెకానిక్ జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు. తన గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి చోరీలు చేసేవాడు. ఆ సొత్తును తన బంధువు సాయంతో అమ్మి డబ్బు సంపాదించే వారు. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఇదీ పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన మునగాల సాయివెంకట కృష్ణ కథ.

జల్సాలకు అలవాటుపడిన సాయికృష్ణ దొంగతనాలు చేయడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే చినరామచంద్రపురానికి చెందిన గార్లపాటి వెంకటేష్​తో పరిచయం ఏర్పడింది. ఆయనతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడేవారు. దొంగిలించిన వాటిని అమ్మేందుకు సాయికృష్ణ బావమరిది లింగంపల్లి దుర్గాప్రసాద్ సాయం చేసేవాడు. చేబ్రోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, గణపవరం, ఆకివీడు ప్రాంతాల్లో వీరిపై దొంగతనం కేసులు నమోదయ్యాయి.

ఈనెల 7న వెల్లమిల్లి జాతీయ రహదారి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ ముగ్గురు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 7.23 లక్షలు ఉంటుందని సీఐ భగవాన్​ప్రసాద్ వెల్లడించారు. ఈ ముఠాను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ నవదీప్ సింగ్ అభినందించినట్లు సీఐ వివరించారు.

ఇదీ చదవండి: తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు

Last Updated : Jan 9, 2020, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details