ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా దుబాచర్లలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By

Published : Mar 4, 2021, 1:41 PM IST

Published : Mar 4, 2021, 1:41 PM IST

man died with current shock
కరెంట్ షాక్​తో వ్యక్తి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబాచర్లలో విద్యుదాఘాతానికి గురై.. వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఉంగుటూరు మండలం గోపాలపురానికి చెందిన బిక్కిన ప్రసాద్ వ్యవసాయ కూలి పనులు చేస్తుంటాడు. దూబచర్లలోని ఓ రైతు తోటలో ఆయిల్​ఫామ్ గెలలు నరికేందుకు కూలి పనికి వెళ్లాడు. ఇనుప గెడ కత్తితో గెలలు నరికే క్రమంలో.. పైన ఉన్న విద్యుత్ తీగలకు తాకింది. విద్యుదాఘాతంతో ప్రసాద్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు.. చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details