ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తణుకులో లాక్ డౌన్.. ఆంక్షలు మరింత కఠినతరం

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మళ్లీ లాక్‌డౌన్‌ నిబంధనల అమలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతించిన సమయంలోగా నిత్యావసర సరకుల కోసం.. ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు.

By

Published : Jul 16, 2020, 6:23 PM IST

Published : Jul 16, 2020, 6:23 PM IST

west godavari district
తణుకులో లాక్ డౌన్.. కిక్కిరిసిపోయిన రోడ్లు

పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. తణుకులో ఉదయం 11 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవటానికి అనుమతించారు. ప్రజలు ఈ సమయాల్లో భారీగా సంఖ్యలో రోడ్ల మీదకి వస్తున్నారు.

నరేంద్ర కూడలి నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రి వరకు అడుగుతీసి అడుగు వేయలేనంతగా ప్రజలు సంచరించారు. రద్దీని తగ్గించడానికి అధికారులు ఆంక్షలు పెంచారు. ప్రధాన రహదారుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details