ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తిస్థాయి లాక్ డౌన్

పశ్చిమగోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమలు చేస్తున్నారు. జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కలెక్టర్​ ఈ నిర్ణయం తీసుకున్నారు.

By

Published : Jul 26, 2020, 12:56 PM IST

lock down in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో లాక్ డౌన్

కరోనా విజృంభిస్తున్న తరుణంలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్​డౌన్ అమలు చేయాలని కలెక్టర్ ముత్యాల రాజు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,500లకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అధిక కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో లాక్​డౌన్ అమలు చేయనున్నారు.

తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, ఆకివీడు పంచాయతీల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు. మొత్తం 42 మండలాల్లోని 83 గ్రామాల్లో లాక్​డౌన్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఈనెల 31 వరకు లాక్​డౌన్ ఉంటుంది. నిత్యావసర దుకాణాలు ఉదయం 11 గంటలవరకు, మందుల దుకాణాలు రోజంతా తెరవడానికి అనుమతి ఇచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం కార్యాలయంలో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీంతో కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు. మిగిలిన అధికారులకు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేసేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది.

ఇవీ చదవండి..

హంద్రీ నదికి పోటెత్తిన వరద ... నీట మునిగిన పంటలు

ABOUT THE AUTHOR

...view details