ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో 3వేలు దాటిన కోరోనా కేసులు.. పలు ప్రాంతాల్లో లాక్​డౌన్

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య మూడువేలు దాటింది. దీంతో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. 289 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

By

Published : Jul 17, 2020, 5:51 PM IST

lock-down
lock-down

పశ్చిమగోదావరి జిల్లా.. పట్టణ ప్రాంతాల్లో లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏలూరు, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు పట్టణాల్లో జనసంచారంపై ఆంక్షలు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత.. రహదారులను పోలీసులు దిగ్బంధం చేస్తున్నారు. వాహనాలు ఎక్కడివక్కడే నిలిపివేస్తున్నారు. జిల్లాలో కొవిడ్ ఉధృతి అధికంగా ఉండటం వల్ల.. లాక్​డౌన్ అమలు చేపట్టారు. జిల్లాలో మూడువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 289 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details