పశ్చిమగోదావరిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో చివరి దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ద్వారకాతిరుమల మండలంలో 28 పంచాయతీలకు ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా.. 27 పంచాయతీలకు.. అలాగే నల్లజర్ల మండలంలోని 24 పంచాయతీలకు ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా 23 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.