ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవ్వలి పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలో రసాభాస - పేరెంట్స్ కమిటీ

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి ఉన్నత పాఠశాల పీఎంసీ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం జరిగిన ఎన్నికలు చెల్లవని... తిరిగి మరోసారి నిర్వహించాలని స్థానికులు పట్టుబట్టారు.

కొవ్వలి పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలో రసాభాస

By

Published : Sep 23, 2019, 8:31 PM IST

కొవ్వలి పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలో రసాభాస

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాల.. పేరెంట్స్ కమిటీ (పీఎంసీ) ఎన్నికలో రసాభాస నెలకొంది. సోమవారం ఉదయం జరిగిన పీఎంసీ ఎన్నిక చెల్లదంటూ కొందరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 6, 8 తరగతులకు ప్రధానోపాధ్యాయుడు నారాయణరావు సమక్షంలో ఎన్నికలు జరగ్గా... 7, 9, పది తరగతుల ఎన్నికలు ఉపాధ్యాయుల సమక్షంలో జరిగాయని ఆ ఎన్నిక చెల్లదని వారించారు. ప్రధాన ఉపాధ్యాయులు లేకుండా ఎన్నిక జరిగిందని కొందరు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక నాయకులు పాఠశాలకు వచ్చి ఎన్నికలు తిరిగి నిర్వహించాలని పట్టుబట్టారు.

ABOUT THE AUTHOR

...view details