ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 30, 2022, 10:23 AM IST

ETV Bharat / state

మా ఆదేశాలకు కొవిడ్​ అడ్డొస్తే.. మరి వాటినెలా నిర్వహించారు:హైకోర్టు

HIGH COURT SERIOUS ON COLLECTOR: కోర్టు ఆదేశాల అమలుకు కొవిడ్‌ అడ్డొస్తే.. పంచాయతీ ఎన్నికలు, ప్రభుత్వ అధికార కార్యక్రమాలనెలా నిర్వహించారని పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కలెక్టర్​ను హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ రికార్డులను తమ ముందుంచాలని ఆదేశించింది.

HIGH COURT SERIOUS ON COLLECTOR
HIGH COURT SERIOUS ON COLLECTOR

HIGH COURT FIRES ON COLLECTOR : కొవిడ్‌ కారణంగా న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయలేకపోయామని పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కలెక్టర్‌, సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు తరఫు న్యాయవాది సుభాష్‌ చెప్పడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. కోర్టు ఆదేశాల అమలుకు కొవిడ్‌ అడ్డొస్తే.. పంచాయతీ ఎన్నికలు, ప్రభుత్వ అధికార కార్యక్రమాలనెలా నిర్వహించారని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ రికార్డులను తమ ముందుంచాలని ఆదేశించింది.

జనవరి 20న నిర్వహించే తదుపరి విచారణకు అధికారులందరూ హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీలోని జడ్పీ ఉన్నత పాఠశాల భవనం, స్థలాన్ని ఆక్రమించి వేడుకలు నిర్వహిస్తున్నారంటూ షేక్‌ సిలార్‌ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. పాఠశాల స్థలంలో ఆక్రమణలుంటే తొలగించాలని, ప్రహరీ నిర్మించాలని 2020 నవంబరు 3న అప్పటి కలెక్టర్‌ ముత్యాలరాజు, అధికారులను హైకోర్టు ఆదేశించింది.

ఆ ఉత్తర్వులు అమలు కాలేదంటూ షేక్‌ సిలార్‌ ఈ ఏడాది సెప్టెంబరులో హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి.. వివరణ ఇచ్చేందుకు తమ ముందు హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలతో గురువారం నాటి విచారణకు సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, నిడదవోలు అప్పటి తహసీల్దార్‌ శాస్త్రి, పంచాయతీరాజ్‌ సబ్‌డివిజనల్‌ ఇంజినీర్‌ ఎం.గంగరాజు తదితరులు హాజరయ్యారు. కొవిడ్‌ కారణంగా జాప్యం జరిగింది వాస్తవమేనని, క్షమాపణలు చెబుతున్నామని ముత్యాలరాజు తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

సర్వే చేసి ఆక్రమణలు తొలగించామన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. బ్యూరోక్రాట్లు పెద్దపెద్ద ప్రైవేటు పాఠశాలల్లో చదివి ఉంటారని, అందుకే ప్రభుత్వ పాఠశాలను విస్మరించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వాతావరణం సక్రమంగా ఉండాలన్న ఉద్దేశంతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details