ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వశిష్టా గోదావరి వెంబడి ఉద్ధృతంగా వరద ప్రవాహం - floods to godavari

గోదావరి పాయ అయిన వశిష్టా గోదావరి వెంబడి వరద నీరు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. దీంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని పలు గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు భారీగా చేరింది.

Heavy Flood Water Inflows to Godavari
Heavy Flood Water Inflows to Godavari

By

Published : Aug 17, 2020, 5:54 PM IST

ధవళేశ్వరం వద్ద భారీగా వస్తున్న వరద నీటిని క్రిందకు వదలడంతో గోదావరి పాయ అయిన వశిష్టా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్రంలో పరుగులు పెడుతోంది. మరోవైపు వరద నీటితో వశిష్టా గోదావరి పొంగిపొర్లడంతో నరసాపురం వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పొలాల్లోకి వరద నీరు చేరి మునిగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరింది. గోదావరి వరదలతో పడవలు గట్టుకే పరిమితమయ్యాయి. వరద ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details