ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోడ్రైవర్లకు సరకులు పంచిన వైకాపా నేతలు

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆటోడ్రైవర్లకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైకాపా నాయకులు సరకులు పంపిణీ చేశారు.లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన చెందారు.

By

Published : May 12, 2020, 12:46 PM IST

grossaries distribution to auto drivers by ycp leaders
grossaries distribution to auto drivers by ycp leaders

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ అమలు కారణంగా.. ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు తణుకులో వైకాపా నాయకులు సరకులు పంపిణీ చేశారు. శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పంపిణీని ప్రారంభించారు.

పట్టణంలోని సుమారు 600 మంది ఆటో డ్రైవర్లకు సరకులతో పాటు.. కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఆటోడ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి తమ వంతు సాయం అందించామని దాతలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details