గోదావరి వరదతో లంక గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి, ఆచంట మండలాల్లో గోదావరి లంకల్లోకి వరద నీరు ప్రవేశించింది. వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. అరటి, తమలపాకులు, కూరగాయలు, పశుగ్రాసాలు, రొయ్యల చెరువులకు తీవ్రంగా నష్టం జరిగింది. పంటల్లో భారీ ఎత్తున నీరు నిలవడం వల్ల పంటలు కుళ్లిపోతాయని రైతులు అంటున్నారు.
గోదారి వరద ప్రభావంతో కుదేలైన రైతులు
పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాల్లో గోదావరి వరద నీరు ప్రవేశించింది. వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది.
గోదారి వరద ప్రభావంతో కుదేలైన రైతులు
TAGGED:
godavari