ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 19, 2022, 11:44 AM IST

ETV Bharat / state

ఆ ఇద్దరి మాటల మధ్య పొంతన లేదు:మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

Arimilli Radhakrishna: టీడీఆర్​ బాండ్ల విషయంలో మంత్రి బొత్స, ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. టీడీఆర్​ బాండ్లు పొందినవారు తెదేపా సానుభూతిపరులని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

Arimilli Radhakrishna
మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

Arimilli Radhakrishna: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘంలో టీడీఆర్​ బాండ్ల విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. పది రోజుల క్రితమే ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు బాండ్ల విషయం తనకు చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారని.. మరోవైపు మంత్రికి నిన్నే చెప్పానని ఎమ్మెల్యే అంటున్నారని అన్నారు. వీరిద్దరి మాటల మధ్య స్పష్టత లేదని అన్నారు.

Arimilli Radhakrishna: టీడీఆర్​ బాండ్లు పొందినవారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆరిమిల్లి ఖండించారు. బాండ్లు పొందినవారిలో కమ్మ సామాజిక వర్గానికి చెంది ఉంటే వారందరూ తెలుగుదేశం సానుభూతిపరులా? అని ప్రశ్నించారు.

బాండ్లు పొందినవారిలో అధికార పార్టీకి చెందిన మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారని, వారెవరూ మంత్రిగారికి కనిపించలేదా? అని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు.



ఇదీ చదవండి:police : ఇష్టానుసారంగా పోలీసుల భౌతిక దాడులు..అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే...

ABOUT THE AUTHOR

...view details