చెరువులో మునిగి కొడుకు... కాపాడబోయి తండ్రి...! - పశ్చిమ గోదావరిలో తండ్రీకొడుకు మృతి
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెంలో... తండ్రీకొడుకులు మృతిచెందారు. చెరువులో పడిన కొడుకును కాపాడబోయి తండ్రీ మునిగిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు.
![చెరువులో మునిగి కొడుకు... కాపాడబోయి తండ్రి...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5147017-251-5147017-1574430616782.jpg)
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెంలో విషాదం జరిగింది. తండ్రీకొడుకు చెరువులో మునిగి మృతిచెందారు. తాటిఆకులగూడెం గ్రామానికి చెందిన కేసుబోయిన కృష్ణ చిన్న కుమారుడు దుర్గాప్రసాద్... పొలం పక్కనే ఉన్న చెరువులో మునిగిపోయాడు. ఇది గమనించిన తండ్రి కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు చనిపోయారు. సాయంత్రమయినా ఇంటికి రాకపోవడంతో... కుటుంబ సభ్యులు వెతికారు. చెరువులో తండ్రి మృతదేహం కనిపించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.