డిసెంబరు మొదటి వారంలో నారుమళ్లు వేసి చివరి వారంలో నాట్లు పూర్తిచేసి, మార్చి 31వ తేదీ నాటికి కోతలు పూర్తి చేయాలి అనేది ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక. డిసెంబర్ నెలలో సగం రోజులు గడిచినప్పటికీ ఇప్పటికి 70 నుంచి 72 శాతం మాత్రమే నారుమళ్లు పూర్తయినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 4 లక్షల 60 వేల ఎకరాల్లో రబీ పండిస్తారు. ఇందుకోసం సుమారు 19 వేల ఎకరాల్లో వేయాల్సి ఉండగా 14 వేల ఎకరాల్లో మాత్రమే పూర్తయినట్లు చెబుతున్నారు. విస్తీర్ణంలో విత్తనాలు వెదజల్లు కోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రబీ పంటలో 120 రోజుల్లో పంటలు చేతికొచ్చే వంగడాలు అందుబాటులో లేవని రైతులు అంటున్నారు. 1121 సైతం పండించడానికి 130 రోజులు కాల పరిమితి అవసరమవుతుందని అంటున్నారు. పంట చివరి దశలో నీరు అందుబాటులో లేకపోతే దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందువల్ల ఏప్రిల్ 15వ తేదీ వరకు నీటిని విడుదల చేసి తమని కాపాడాలని రైతులు కోరుతున్నారు.