కాలువలో అడుగంటిన నీరు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామ రైతులకు శాపంగా మారింది. పంట చివరి దశలో సాగు నీరు అందకపోవటంతో ఎండిపోతోంది. పచ్చగా ఉన్న పంట భూములు నెర్రలు ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడైనా వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న రైతు... పంట మీద ఆశ వదులుకోలేక చిన్న చిన్న కాలువల నుంచి ఇంజిన్ల సాయంతో నీటిని పొలానికి మళ్లిస్తున్నారు.
అసలే నీరు లేక అల్లాడుతున్న దెందులూరు రైతులకు.. చెక్పోస్ట్ సమీపంలో సాగునీటి కాలువలో ప్రవాహానికి అడ్డుగా 300 మీటర్ల మేర పేరుకు పోయిన గుర్రపు డెక్క తీవ్ర సమస్యగా మారింది.