తెలంగాణ నుంచి పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని జీలుగుమిల్లిలో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వ్యాపారులు సరుకును అక్రమంగా తీసుకొస్తున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి.. 84 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అజయ్కుమార్ సింగ్ తెలిపారు.
జీలుగుమిల్లిలో అక్రమ మద్యం పట్టివేత.. నలుగురి అరెస్టు - west godavari latest news
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న గొలుసు దుకాణ వ్యాపారులను జీలుగుమిల్లి వద్ద ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల నుంచి 84 మద్యం సీసాల స్వాధీనం చేసుకున్నారు.
నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు