ఏలూరు రేంజ్ డీఐజీ ఆకస్మిక తనిఖీలు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, మద్యం గొలుసు దుకాణాలు నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. జూదాలు జరగకుండా ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గాయని తెలిపారు. ఈ సందర్భంగా ఓ మహిళా చిరు వ్యాపారి తనపై కొందరు దౌర్జన్యం చేసి వ్యాపారం చేసుకోనివ్వటం లేదనీ, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డీఐజీకి ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: