ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల ఆందోళన - latest news on electricity employees

తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. విద్యుత్ ఉద్యోగ ఐక్య కార్యచరణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

employees protest at alur
సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

By

Published : Nov 9, 2020, 3:45 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విద్యుత్ ఉద్యోగ ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టారు. ప్ల కార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.

'ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, మెడికల్ పాలసీని కుటుంబీకులకు వర్తింప చేయాలి, పాత పింఛన్ విధానం అమలు చేయాలి, విద్యుత్ సంస్థల ప్రైవేటీకర యత్నాన్ని మానుకోవాలి' అని నినాదాలు చేశారు. తమ సమస్యలు చాలా కాలంగా తీరడం లేదని ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details