ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీమా డబ్బులకోసం తలవెంట్రుకలు పోయాయని ఫిర్యాదు..

అప్పులు ఎక్కువ కావడంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తలవెంట్రుకల కంపెనీ యజమాని తన గోదాములో చోరీ జరగకపోయినా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 60 లక్షలు విలువ చేసే తలవెంట్రుకలు పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

By

Published : Jun 29, 2020, 9:57 PM IST

due to insurance money a hair  business  person crated a drama in west godavari dst
due to insurance money a hair business person crated a drama in west godavari dst

తనకున్న అప్పులను తీర్చుకునేందుకు బీమా కంపెనీ నుంచి డబ్బు రాబట్టుకునేందుకు ప్రణాళిక వేసిన వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురానికి చెందిన వెంకటేశ్వరరావు తన గోదాములో లక్షలాది రూపాయలు విలువచేసే తలవెంట్రుకలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీటి విలువ సుమారు రూ. 60లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కూపీలాగిన పోలీసులు అసలు దొంగ.. తలవెంట్రుకల కంపెనీ యజమాని వెంకటేశ్వరరావే అని నిగ్గుతేల్చారు. దొంగతనం జరగకపోయినా.. బీమా కోసం పోలీసు ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరావు అంగీకరించాడు. లాక్ డౌన్ వల్ల అప్పులపాలయ్యానని అందుకే ఇలా చేశానని వెంకటేశ్వరరావు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details