కరోనా కేసులు పెరుగుతున్నందున పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సడలింపులతో కూడిన లాక్డౌన్ విధించారు. సోమవారం నుంచి పట్టణ పరిధిలోని దుకాణాల అనుమతి సమయాన్ని కుదించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. నిత్యావసరాలకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. మిగిలిన వర్తక, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. వైద్య అవసరాల కోసం వచ్చే వారిని మాత్రం పట్టణంలోకి అనుమతించారు. లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అధికారులు కోరారు.
కరోనా విజృంభణ...తణుకులో మళ్లీ లాక్డౌన్ - thanuku corona news
తణుకు నియోజకవర్గంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి తణుకులో లాక్డౌన్ విధించారు అధికారులు. ప్రజలంతా లాక్డౌన్కి సహకరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరారు.
'తణుకులో లాక్డౌన్... ప్రజలారా పాటించండి'