ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లాలో పేదలకు నిత్యావసర సరకులు, కూరగాయలను దాతలు పంపిణీ చేశారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ రోజు వారి కూలీలు, పేదల ఇబ్బందులు చూసిన దాతలు వీరిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

By

Published : Apr 23, 2020, 8:31 AM IST

donors donating essentials to poor and police officers in west godavari district
నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న దాతలు

కొవ్వలి గ్రామానికి చెందిన వడ్లపట్ల సుధాకర్ బాబు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు నిరంతరం కృషి చేస్తున్నందుకు వీరికి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు పండ్లు, శానిటైజర్లు పంచిపెట్టారు. కొవ్వలి పంచాయతీ కార్మికులకు 25 కేజీలు బియ్యం, కూరగాయలు అందించారు.

నర్సాపురం మండలం సార్వ గ్రామంలో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో రూ. లక్షతో సమకూర్చిన కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలోని 1000 కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details