ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లాక్​డౌన్​లో మినహాయింపులు..పెరుగుతున్న కొవిడ్​ కేసులు

By

Published : Aug 22, 2020, 9:57 PM IST

జిల్లాలో కొవిడ్​ కేసులు విజృంభిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో సైతం 1131, 854 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే లాక్​డౌన్​లో మినహాయింపులివ్వగా.. ఆదివారం కర్ఫ్యూను సడలించారు. దీంతో కేసులు సంఖ్య అమాంతం పెరిగింది.

covid cases are increasing in west godavari district
జిల్లాలో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 1131 కేసులు రాగా... శనివారం సైతం 854 కేసులు వచ్చాయి. వీటితో కలిపి ప్రస్తుతం జిల్లాలో 29,156 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నుంచి జిల్లాలో లాక్​డౌన్​ను సడలించారు. ఆదివారం కర్ఫ్యూను ఎత్తేశారు. దీంతో కేసుల తీవ్రత తారాస్థాయికి చేరింది. గత వారం రోజులుగా 800కు పైగా పాజిటివ్​ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఏలూరులో రెండు కొవిడ్​ ఆసుపత్రులు, రెండు కొవిడ్​ కేర్​ సెంటర్లను ఏర్పాటు చేశారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో కొవిడ్​ కేర్​ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details