పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటకు చెందిన జయరాజు(36), వెంకమ్మ(25)లు దంపతులు. భర్త అరటి పండ్ల వ్యాపారం..భార్య కూలీ పనులే ఆ కుటుంబానికి ఆదాయ వనరు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఆర్థిక సమస్యలో..మరింకేం బాధలో తెలీదు తరచూ ఘర్షణ పడేవారని వెల్లడైంది. ఆ కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు కారణమయ్యాయి. వెంకమ్మ ఇంట్లో ఉరేసుకుని చనిపోగా..ఆమె భర్త వరండాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల మరణంతో వారి పిల్లలు అనాథలయ్యారని బంధువులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య - విషాదం: కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
కుటుంబంలో చెలరేగిన కలహాలు రెండు ప్రాణాల్ని బలితీసుకున్నాయి. పశ్ఛిమగోదావరి జిల్లా కవ్వకుంటలో భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విషాదం: కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
TAGGED:
ap crime news