పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఆయన విజయవాడలో హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. సోమవారం, మంగళవారం రెండ్రోజులూ ఆయన శాసనసభకు హాజరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో బుధవారం అసెంబ్లీ లాబీల్లో అంతా అదే చర్చ సాగింది. ఆ రెండ్రోజులూ ఆయనతో ఎవరెవరు మాట్లాడారు? సభలో ఆయన పక్కన ఎవరు కూర్చున్నారు? ఎవరెవరు ఆయనతో కాంటాక్ట్ అయ్యారంటూ పలువురు ఆరా తీశారు. అసెంబ్లీ బుధవారం యథావిధిగా కొనసాగడంతో శానిటైజేషన్పై పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, సిబ్బంది మధ్య చర్చ సాగింది. అయితే ఉదయాన్నే శానిటైజ్ చేశామని అసెంబ్లీ అధికారులు తెలిపారు.
‘కరోనా-ఆరోగ్యశ్రీ’పై నేడు శాసనసభలో చర్చ