ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా సోకినా అధికారులకు చెప్పలేదు!

బంధువులను కలిసేందుకు వెళ్లిన ఆ విశ్రాంత అధికారికి కరోనా పాజిటివ్​గా నిర్థణ అయ్యింది. స్వస్థలానికి వెళ్లిన ఆయన.. అధికారులకు ఎటువంటి సమాచారం అందించలేదు. చివరికి అధికారులే బాధితుడిని గుర్తించి కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరగింది.

By

Published : Jul 16, 2020, 9:35 PM IST

Published : Jul 16, 2020, 9:35 PM IST

corona-positive-case-registers-in-gangareddy-gudem-at-west-godavari-district
కరోనా సోకినా అధికారులకు చెప్పలేదు!

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. పట్టణానికి చెందిన విశ్రాంత తపాల శాఖ ఉద్యోగి ఇటీవల భీమవరంలో బంధువులను కలిసేందుకు వెళ్లారు. అక్కడ అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో విశ్రాంత ఉద్యోగి జంగారెడ్డిగూడెం వచ్చేశారు.

సమాచారం అందుకున్న వైద్యాధికారులు బాధితుడిని గుర్తించి ఏలూరు కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. పరిసర ప్రాంతాల్లో సూపర్ శానిటేషన్ పూర్తిచేసి ప్రాథమిక, సెకండరీ కాంటాక్ట్ వివరాలను సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details