పెరుగుతున్న కరోనా కేసులు... అధికారులు అప్రమత్తం - corona cases in west godawari
పశ్చిమగోదావరి జిల్లాలో లాక్డౌన్ నిబంధలు కఠినతరం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు నివారణ చర్యలు ముమ్మరం చేశారు.

పెరుగుతున్న కరోనా కేసులు..అధికారులు అప్రమత్తం
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఒక్కరోజే 12 కొత్త కేసులు నమోదు కావటంతో జిల్లాలో పరిస్థితిపై అధికారులు సమీక్షిస్తున్నారు. కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్జోన్గా ప్రకటించి ఇంటింటి సర్వే చేపట్టారు. లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దని సూచించారు.