ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాగంటి బాబుకు చంద్రబాబు పరామర్శ - మాగంటి బాబు కుమారుడి మృతిపై చంద్రబాబు సంతాపం

మాజీ ఎంపీ మాగంటి బాబును తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. బాబు కుమారుడు రవీంద్ర మరణవార్త కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి బాబు కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

chandra babu condolence to maganti babu young  son
chandra babu condolence to maganti babu young son

By

Published : Jun 2, 2021, 2:23 PM IST

మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్రనాథ్‌ మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. రవీంద్ర మరణవార్త తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి బాబును ఫోన్లో పరామర్శించారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను కోల్పోవడం బాధాకరమన్నారు.

మాగంటి బాబు కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేలా మనో ధైర్యం ఇవ్వాలని.. రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details