ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేత చింతమనేని ప్రభాకర్​పై కేసు నమోదు

ఉపాధి హామీ పనులు కల్పించి పేదలను ఆదుకోవాలంటూ ఆందోళన నిర్వహించిన తెదేపా నేత చింతమనేని ప్రభాకర్​పై కేసు నమోదైంది. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లఘించారంటూ ఆయనతో పాటు మరో 20 మందిపైనా కేసు పెట్టారు పోలీసులు.

By

Published : May 1, 2020, 11:58 PM IST

chintamaneni
chintamaneni

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ తెలుగుదేశం పార్టీ నేత, పశ్చిమగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై కేసు నమోదైంది. ఉపాధి హామీ పనులు కల్పించి పేదలను ఆదుకోవాలంటూ చింతమనేని ప్రభాకర్... కూలీలతో కలిసి పెదవేగి మండలం దుగ్గిరాలలో శుక్రవారం ఉదయం ఆందోళన నిర్వహించారు. భౌతికదూరం పాటిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఆందోళనలో పాల్గొన్న 20 మందిపై కేసు చేశారు.

ABOUT THE AUTHOR

...view details