ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపుతప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా... ముగ్గురికి గాయాలు

ఉంగుటూరులో అదుపుతప్పి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్​, ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.

By

Published : Jan 22, 2020, 11:52 PM IST

అదుపుతప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా... ముగ్గురికి గాయాలు
అదుపుతప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా... ముగ్గురికి గాయాలు

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో ప్రైవేట్​ స్కూల్​ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. నల్లజర్లకులోని ఏ.కే.ఆర్.జీ. పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తుండగా.. తిమ్మయ్యపాలెం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఇద్దరు విద్యార్థులతో పాటు బస్సు డ్రైవర్ వెంకట్రావు స్వల్పంగా గాయపడ్డారు.

ఉంగుటూరులో అదుపుతప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా

ABOUT THE AUTHOR

...view details