ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికులను తరలించిన బస్సుకు ప్రమాదం - కొవ్వూరులో బస్సు ప్రమాదం

వలస కార్మికులను తమ స్వస్థలాలకు తరలించి తిరిగి వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి నిడదవోలు రైల్వేస్ఠేషన్​కు తరలించి తిరిగి కొవ్వూరు వస్తుండగా బస్సు చెట్టును ఢీ కొట్టింది.

bus accident
bus accident

By

Published : May 7, 2020, 6:42 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు వద్ద వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చి తిరిగి వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొవ్వూరు నుంచి వలస కార్మికులను నిడదవోలు రైల్వేస్టేషన్ కి తరలించి తిరిగి కొవ్వూరు వస్తున్న బస్సు చెట్టును ఢీకొంది.

బస్సులో విధులు నిర్వహిస్తున్న వారిని ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం, వీఆర్వో కడిమి కిషోర్, రవీంద్రగా గుర్తించారు. గాయపడ్డవారిని కొవ్వూరు ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details