పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం, పసలపూడి, కాల్దరి, నిడదవోలు మండలం తాళ్లపాలెం, సింగవరం మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షాలకు అపార పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు బాధిత ప్రాంతాల్లో పర్యటించి రైైతులతో మాట్లాడారు.
ఎర్ర కాలువ ముంపు వల్లే..
అనంతరం ఎర్ర కాలువ ముంపునకు గురైన పంట పొలాల్లో కలియతిరిగారు. పెట్టుబడి పూర్తి అయి పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో ఎర్ర కాలువ వరద నిలువునా ముంచేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వరద నీటిలోని వరి దుబ్బులను అన్నదాతలు ఆయనకు చూపించారు.