ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇద్దరు బాలురు అదృశ్యం .. పోలీసుల ముమ్మర గాలింపు

By

Published : Jan 10, 2021, 11:22 AM IST

సైకిల్​ తొక్కుకుంటూ వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

boys missing
ఇద్దరు బాలుర అదృశ్యం .. పోలీసుల ముమ్మర గాలింపు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. శనివారం సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళ్లిన యశ్వంత్​, అభి అనే బాలురు కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యశ్వంత్ ఆరవ తరగతి చదువుతుండగా , అభి ఐదో తరగతి చదువుతున్నాడు. వారి తండ్రి సురేష్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలుర అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details