ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిడదవోలు తహసీల్దార్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ - bomb at nidadhavole

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు తహసీల్దార్, సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు తనిఖీ చేయగా.. బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు.

Bomb threat call to Nidadavolu MRO office
Bomb threat call to Nidadavolu MRO office

By

Published : Feb 6, 2021, 5:50 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు తహసీల్దార్, సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన కార్యాలయంలో సిబ్బందిని ఖాళీ చేయించారు. తహసీల్దార్, సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్​ చేశాడు. వెంటనే కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. సిబ్బందిని బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. ఏలూరు నుంచి బాంబ్​ స్క్వాడ్ కార్యాలయానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ఎలాంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు.

సిబ్బందిని కార్యాలయానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా ఆగంతకుడి వివరాలు సేకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: పంచాయతీ పోరు: కీలకంగా మారనున్న యువతుల ఓట్లు

ABOUT THE AUTHOR

...view details