తరచూ ఏలూరు కలెక్టర్లో నిర్వహించే సమావేశాలకు హాజరై తిరిగి రావడానికి తాను భయపడుతున్నానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. మోషేన్రాజుకు ఆరోగ్యం సహకరించకపోయినా.. ఈ రోడ్లపై తిరుగుతూ ఎంతోమందిని కలవడాన్ని కొనియాడారు. రోడ్ల దుస్థితిపై అధికార పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు ఎమ్మెల్యే మాటలకు నివ్వెరపోయారు. ఏదేమైనా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు.
BAD ROADS: ఈ రోడ్లపై ఆయన బాగానే తిరుగుతున్నారు..ఇంకా వైకాపా ఎమ్మెల్యే ఏమన్నారంటే..! - bad roads
పశ్చిమగోదావరి జిల్లాలోని రోడ్ల దుస్థితిపై అధికార పార్టీ నేతల మధ్య జరిగిన సంభాషణ సర్వత్రా చర్చకు దారితీసింది. జిల్లాలోని రోడ్లపై ప్రజలు ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొందని వైకాపా నేత చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారింది.
![BAD ROADS: ఈ రోడ్లపై ఆయన బాగానే తిరుగుతున్నారు..ఇంకా వైకాపా ఎమ్మెల్యే ఏమన్నారంటే..! BAD ROADS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12984552-1029-12984552-1630927096656.jpg)
BAD ROADS
రోడ్ల స్థితిపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
ఇదీ చదవండి: