పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో భక్త ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించి పూజలు, హోమం కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. ఎల్ఎస్వీ శాస్త్రీ, నాగబాబు శర్మ పర్యవేక్షణలో అర్చకులు వేద మంత్రాలు చదువుతూ పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం పలు రకాలైన పూజలు నిర్వహించి.. అనంతరం హోమం చేశారు. గ్రామానికి చెందిన భక్తులు పూజా హోమం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ - denduluru
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలిలో భక్తాంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

హనుమ విగ్రహ ప్రతిష్ఠ