ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమానుషం: అప్పు తీర్చలేదని యువకుడికి శిరోముండనం

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఓ యువకుడికి శిరోముండనం చేయించిన అమానుష ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

By

Published : Oct 4, 2020, 11:53 PM IST

Updated : Oct 5, 2020, 9:15 AM IST

అప్పు తీర్చలేదని యువకుడికి శిరోముండనం
అప్పు తీర్చలేదని యువకుడికి శిరోముండనం

అప్పు తీర్చలేదని యువకుడికి శిరోముండనం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడికి శిరోముండనం చేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెనికి చెందిన బాధితుడు... అదే పట్టణానికి చెందిన ఎర్రసాని విజయబాబు వద్ద 3 నెలల కిందట 30 వేల నగదు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ బాధితుడిని... విజయబాబు వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి విజయబాబు మరో ముగ్గురితో కలిసి బాధితుడిని తాడేపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం బలవంతంగా కారులో తీసుకెళ్లి ఓ లేఔట్​లో నిర్బంధించారు. ఓ యువకుడిని పిలిపించి శిరోముండనం చేయించి... జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద విడిచిపెట్టారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించటంతో ఎర్రసాని విజయబాబు, షేక్ నాగూర్ మీరావలి, కంకిరెడ్డి మార్కండేయులు, మోటూరి మణికంఠలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 5, 2020, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details