ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో పెరుగుతున్న కరోనా కేసులు..నిబంధనలు కఠినతరం - పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్​డౌన్

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, అత్తిలి, ఇరగవరంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మునిసిపల్ , రెవెన్యూ అధికారులు పూర్తి బంద్​కు పిలుపునిచ్చారు.

bandh at tanuku
తణుకులో బంద్​

By

Published : Aug 23, 2020, 8:21 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, అత్తిలి, ఇరగవరంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మునిసిపల్, రెవెన్యూ అధికారులు పూర్తి బంద్​కు పిలుపునిచ్చారు. పాల కేంద్రాలకు, ఔషధ దుకాణాలకు మినహాయింపునిచ్చారు. మిగిలిన వర్తక వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. పెట్రోల్ బంకులు సైతం మూసివేశారు. వైద్య అవసరాల కోసం వచ్చే వారిని మాత్రం పట్టణంలోనికి అనుమతించారు. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం పూర్తి బంద్ పాటించాలని... మంగళ, శుక్రవారాలు నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహాయించి మిగిలిన అన్ని దుకాణాలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోమ, బుధ, గురు, శని వారాలలో మాత్రమే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చునని నిబంధనలలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి.ఊరూ, వాడా ఏకమై... అమరావతి పరిరక్షణకు భాగస్వాములై.

ABOUT THE AUTHOR

...view details