పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి స్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొవిడ్కు సంబంధించి దేశవాళీ ఉత్పత్తుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యదర్శితో ప్రధాని మాట్లాడటం శుభపరిణామం అని జిల్లా ఆయుర్వేద సూపరింటెండెంట్ నగేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేదిక్, పంచకర్మ హాస్పిటళ్లను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.
ఘనంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలు - ఏలూరులో ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేదిక్, పంచకర్మ హాస్పిటళ్లను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.

ఘనంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలు