ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కోడి పందేలు.. పేకాటను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం'

By

Published : Dec 31, 2020, 2:13 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, విద్యార్థులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. రాబోయే సంక్రాంతికి కోడిపందేలు, పేకాటను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు.

Awareness rally under the auspices of the police against unethical activities at Eluru in West Godavari district
'కోడిపందేలు.. పేకాటను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం'

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అసాంఘిక కార్యకలాపాలు, కోడిపందేలు, పేకాటలకు వ్యతిరేకంగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళా సంరక్షణ కార్యదర్శులు, విద్యార్థులు, మహిళా పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నగరంలోని సురేష్ చంద్ర బహుగుణ పాఠశాల నుంచి అగ్నిమాపక కూడలి వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. అగ్నిమాపక కూడలి వద్ద మనవహారం ఏర్పాటు చేశారు. రాబోయే సంక్రాంతికి కోడిపందేలు, పేకాట కాకుండా.. ఇతర క్రీడలను నిర్వహించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details