ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండో దశ ఎన్నికలకు జోరుగా ఏర్పాట్లు - పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో దశ ఎన్నికల తాజా వార్తలు

రెండో దశ ఎన్నికలకు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 13 మండలాల్లో 195 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్న తరుణంలో అందుకు అవసరమైన సామగ్రిని పోలింగ్ అధికారులకు పంపిణీ చేస్తున్నారు. అనంతరం అధికారులు నిర్ధేశించిన మార్గాల్లో వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

arrangements for the second phase elections
రెండో దశ ఎన్నికలకు జోరుగా ఏర్పాట్లు

By

Published : Feb 12, 2021, 3:16 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో పంచాయతీ రెండోదశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమైంది. 13 మండలాల్లో 195 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా మండలాల్లోని ప్రతి మండల కార్యాలయం వద్ద సమీప పాఠశాలల్లో సామగ్రి పంపిణీ ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారులు.. పంచాయతీ వార్డులు వారిగా పోలింగ్ సజావుగా సాగడానికి, పోలింగ్ వివరాలు నమోదు చేయడానికి అవసరమైన పత్రాలను, బ్యాలెట్ బాక్సులను సిబ్బందికి అందజేశారు.

నిర్దేశించిన మార్గాల్లో పోలింగ్​ కేంద్రాలకు సామగ్రి...

సిబ్బందికి అప్పగించిన సామగ్రిని పరిశీలించుకున్న అనంతరం పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. పోలింగ్ కేంద్రాలను దృష్టిలో వుంచుకొని.. వారు ప్రయాణించే దారులను ఏర్పాటు చేశారు. రూట్ల వారీగా బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఇవీ చూడండి...

2013 - 14 లెక్కల ప్రకారమే పోలవరం వ్యయం: కేంద్రం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details