ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP CRIME NEWS: వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి - ఏపీ తాజా సమాచారం

ap crime news : రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు హత్యకు గురయ్యారు. మరో చోట జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ap crime news
ap crime news

By

Published : Feb 23, 2022, 10:09 AM IST

ap crime news : రాష్ట్రంలో పలు జిల్లాల్లో ముగ్గురు దారుణ హత్యకు గురైయ్యారు. మరో జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అనుమానంతో హత్య..

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో భాగ్యలక్ష్మిపేటలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచాడో ఓ దుర్మార్గుడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బండరాళ్లతో కొట్టి..
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనమలిపురిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన తాటికొండ నవీన్(19)ను దుండగులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గొంతుకోసి..

విశాఖ జిల్లా ఆనందపురం మండలం కల్లివానిపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పైడిరెడ్డిని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి చంపేశారు.

రెండు బైకులు ఢీ...

కృష్ణాజిల్లా నందిగామ రామన్న పేట రోడ్డులో జానకిరామయ్య కాలనీ వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో.. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీ.. ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరమ్మతుకు గురైన మినీ లారీని మరో వాహనంతో తీసుకెళ్తుండగా.. వేరొక లారీ వచ్చి ఢీ కొట్టింది. ఘటనాస్థలంలోనే ఒకరు మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.

ఇదీ చదవండి:

lovers suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. గోదావరిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య?

ABOUT THE AUTHOR

...view details