ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పశ్చిమలో మొదలైన బస్సుల రాకపోకలు

పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సుల ప్రయాణం మొదలైంది. 8 డిపోల్లో 150 బస్సు సర్వీసులు తిప్పుతున్నారు. ప్రయాణికులకు థర్మల్​ స్క్రీనింగ్​ పరీక్షల అనంతరం టికెట్లు ఇచ్చి బస్సుల్లోకి పంపిస్తున్నారు.

By

Published : May 21, 2020, 1:08 PM IST

Published : May 21, 2020, 1:08 PM IST

after lock down buses started
పశ్చిమ గోదావరి జిల్లాలో బయలుదేరిన బస్సులు

పశ్చిమ గోదావరి జిల్లాలో 60 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. జిల్లాలోని 8 డిపోల్లో 150 బస్సుల వరకు తిరుగుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సులో ప్రయాణికులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రయాణికులు ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించుకున్నాకే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. వారి పూర్తి వివరాలు నమోదు చేసుకొని, మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సూచించిన టికెట్ ధరలకే వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details