ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలకు అన్నం పెట్టారు.. డబ్బులిచ్చారు! - latest news of corona in west godavari dst

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్య నారాయణపురం వద్ద గుండుగొలుసు గ్రామానికి చెందిన వ్యక్తి... వలస కూలీలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దారి ఖర్చులకు తమవంతు సాయంగా ఒక్కొక్కరికి వందరూపాయలు ఇచ్చారు.

a person gave help to migrate  workers to provid food and gave moeny
a person gave help to migrate workers to provid food and gave moeny

By

Published : May 10, 2020, 5:17 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన రుద్రరాజు రవి రాజా... వలస కూలీలకు భోజనాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ , బీహార్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలకు వెళుతున్న వలస కూలీలకు భోజనాలు పెట్టారు.

దూరప్రాంతాలకు వెళ్తున్న వాహనచోదకులకు ఆహారం అందించారు. నడిచి వెళ్తున్న కూలీలకు భోజనాలు పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి వంద రూపాయలు చొప్పున దారి ఖర్చులుగా ఇచ్చారు. లాక్ డౌన్ ముగిసే వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం వలస కూలీల భోజనాలు పెట్టేందుకు చర్యలు తీసుకున్నామని రవిరాజ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details