నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న భారత్ బంద్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. బంద్కు రాజకీయ పార్టీలు, రైతుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలపడంతో...జిల్లాలోని ప్రధాన ప్రాంతాలు నిర్మానుశంగా కనిపించాయి. పలు ప్రాంతాల్లో అఖిలపక్ష నేతలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
ఏలూరులో
ఏలూరులోని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో భారత్ బంద్కు మద్దతుగా రైతు సంఘాలు నిరసన తెలిపారు. కొద్దిసేపు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. భారత్ బంద్లో భాగంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తణుకులో