ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 20, 2019, 5:49 PM IST

ETV Bharat / state

పందులు పెంచొద్దు అన్నందుకు... ప్రాణాలు తీయబోయాడు

పందుల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం... కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.

a man attacked with knife on sanitary inspector over pigs issue

పందులు పెంచవొద్దు అన్నందుకు... ప్రాణాలు తీయబోయాడు

పందులు పెంచవద్దని చెప్పినందుకు... ఓ శానిటరీ ఇన్స్​పెక్టర్​పై పందుల పెంపకందారుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని తంగెళ్లమూడి గౌరీదేవి గుడి సమీపంలో జరిగింది. రంగయ్య అనే వ్యక్తి తంగెళ్లమూడి ప్రాతంలో పందులను పెంచుకుంటూ... జీవనం సాగిస్తుంటాడు. అయితే అక్కడ పందులు పెంచకూడదంటూ జేవీ శ్రీరామమూర్తి అనే శానిటరీ ఇన్స్​పెక్టర్ రంగయ్యకు చెప్పాడు. కోపోద్రిక్తుడైన రంగయ్య... అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీరామమూర్తి చేతికి తీవ్రగాయమైంది. రంగయ్యను పట్టుకుని శానిటరీ సిబ్బంది, స్థానికులు దేహశుద్ధి చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details