ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2021, 6:12 PM IST

ETV Bharat / state

స్మిత కేర్ ఫౌండేషన్ నుంచి 5 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల అందజేత

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని వల్లూరి అమ్మన్న మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్​కు ప్రముఖ పాప్ సింగర్ స్మిత ఫౌండేషన్​ 5 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు బండా సుష్మా, నానిలు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు వాటిని అందజేశారు. కాన్సన్​ట్రేటర్లను అందిచండం ఆనందంగా ఉందని స్మిత తెలిపారు.

oxygen concentrators
ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల అందజేత

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వల్లూరి అమ్మన్న మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్​కు.. స్మిత కేర్ ఫౌండేషన్ సంస్థ 5 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను అందజేసింది. ట్రస్ట్ ద్వారా వేల్పూరు పరిసర ప్రాంతాలకు చెందిన కరోనా బాధితులకు వీటిని అందించనున్నారు.

ప్రముఖ పాప్ సింగర్ స్మిత స్థాపించిన ఈ ఫౌండేషన్​ను నుంచి ఆ సంస్థ ప్రతినిధులు బండా సుష్మా, నానిలు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు అందజేశారు. తమ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్నామని.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందలకుపైగా ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను వితరణ చేసినట్లు ఆన్​లైన్​లో స్మిత తెలిపారు. స్మిత కేర్ ఫౌండేషన్ అందించిన కాన్సన్​ట్రేటర్లను వేల్పూరు పరిసర ప్రాంతాల్లో అవసరమైన రోగులకు ఐదు రోజుల పాటు ఉచితంగా అందిస్తామని ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. కాన్సన్​ట్రేటర్లతో పాటు మాస్క్​లను కూడా ఉచితంగా అందిస్తామని అని ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details