ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి - పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

accident-in-west-godavari-dot-dot-dot-3-people-died
accident-in-west-godavari-dot-dot-dot-3-people-died

By

Published : Mar 4, 2020, 6:54 AM IST

Updated : Mar 4, 2020, 10:36 AM IST

06:49 March 04

కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద నరసాపురం కాలువలోకి కారు దూసుకెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాహనం నుంచి బయటకిరాలేక అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పోలీసులు కారును, అందులోని మృతదేహాలను వెలికితీశారు. మృతులు యలమంచలి మండలం కాజా గ్రామ వాసులుగా గుర్తించారు. వారు కాజా నుంచి కాకినాడకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోంది. నిద్రమత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి

ప్రేమను ఒప్పుకోలేదని యువతికి పురుగులమందు తాగించాడు


 

Last Updated : Mar 4, 2020, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details