ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లా రెడ్​జోన్లలో 27 మండలాలు - ఏపీలో లాక్​డౌన్​ వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా 27 మండలాలను రెడ్​జోన్​ పరిధిలోకి తీసుకువచ్చారు. రెడ్​జోన్లలో లాక్​డౌన్​ని కట్టుదిట్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలను ఇంటికే పంపిస్తున్నారు.

27 mandals are in  Red Zone at West Godavari district
27 mandals are in Red Zone at West Godavari district

By

Published : Apr 24, 2020, 8:02 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో 27 మండలాలను.. అధికారులు రెడ్​జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మిగతా 21 మండలాలను గ్రీన్ జోన్​లో ఉంచారు. పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన ఏలూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, కొవ్వూరు పట్టణాల్లో పూర్తిగా ప్రజల రాకపోకలు కట్టడి చేశారు. జిల్లాలో 39 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఏలూరులో అత్యధికంగా 15, పెనుగొండ 11, తాడేపల్లిగూడెం 5, భీమవరం 2, ఉండి 2, ఆకివీడు 1, నరసాపురం 1, గుండుగొలను 1, కొవ్వూరు 1.. పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1587 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఏలూరులో పాజిటివ్ కేసులు సంఖ్య పెరగడంతో.. లాక్​డౌన్​ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రెడ్​జోన్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా.. నిత్యావసర సరకులు, కూరగాయలు సరఫరా చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details