ఆంధ్రప్రదేశ్

andhra pradesh

12 అడుగుల కొండ చిలువకు శస్త్రచికిత్స

By

Published : Nov 12, 2020, 6:26 PM IST

చేపల వలలో చిక్కుకుని వారం రోజులు ఇబ్బంది పడిన ఓ కొండ చిలువను రక్షించింది స్నేక్ సేవియర్ సొసైటీ. తీవ్రంగా గాయపడిన దానికి శస్త్రచికిత్స చేయించింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

python
python

కొండ చిలువకు శస్త్రచికిత్స

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమల్లి సమీపంలోని ఓ తూము చెరువు ప్రాంతంలోని ఓ పొలం వద్ద చేపల వలలో 12 అడుగుల కొండ చిలువ చిక్కుకుంది. వారం రోజులు అలాగే ఉండిపోయింది. దానిని బయటకు తీయడానికి భయపడిన రైతులు... స్నేక్ సేవియర్ సొసైటీ డైరెక్టర్ క్రాంతి చదలవాడకు సమాచారం అందించారు.

అక్కడకు చేరుకున్న క్రాంతి... చేపల వలలో చిక్కుకున్న కొండచిలువను రక్షించి జంగారెడ్డిగూడెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అనంతరం వైద్యం కోసం జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురం వద్ద గల పశువుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శ్రీనివాస్ కొండచిలువకు శస్త్రచికిత్స చేశారు. 10 రోజుల పర్యవేక్షణ అనంతరం కొండచిలువను అడవిలో వదిలేస్తామని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details